హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో కరోనా ఉద్ధృతిని కట్టడిచేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరికొద్దిసేపట్లో ఆ శాఖ అధికారుతో సమీక్ష నిర్వహించనున్నారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో జరగనున్న ఈ సమావేశంలో కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. కరోనా కేసులు, దవాఖానల్లో పడకలు, ఇతర అంశాలపై సమీక్షిస్తారు.
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా మరో 887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల కొత్తగా నలుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,08,776కు చేరింది. ఇందులో 3,01,564 మంది బాధితులు కోలుకోగా, 1,701 మంది మరణించారు. మరో 5511 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 2166 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. నిన్న కొత్తగా 337 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..