యాదాద్రి భువనగిరి :యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని కోరినట్లు మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం