వరంగల్ : జర్మనీలోని నదిలో గల్లంతైన సాప్ట్వేర్ ఇంజినీర్ కడారి అఖిల్ కుటుంబాన్ని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం పరామర్శించారు. వరంగల్ నగరం కరీమాబాద్లో నివాసముంటున్న అఖిల్ తల్లిదండ్రులు కడారి పరశు రాములు, అన్నమ్మను పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగు సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.