వరంగల్ : జిల్లాలోని రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన తండ్రి, కూతురు ఓరుగంటి వెంకన్న, ముంజంపల్లి అనూష కుటుంబ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఆదివారం పరామర్శించారు. తొర్రూరులో మార్చురీలో వారి మృతదేహాలన చూసి కంటతడి పెట్టారు.
ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనూష భర్త తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండగా, అతనికి మంచి వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.అనంతరం మొరిపిరాల గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.