పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి గ్రామంలోగల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అక్టోబర్ 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ ప్రారంభ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గ్రామస్తులు మంత్రిని కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సాయిబాబా ఆలయం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన గ్రామస్తులను మంత్రి అభినందించారు. గ్రామంలో దేవాలయ అభివృద్ధికి తాను ఎప్పుడూ సహకరిస్తామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో మందిర నిర్వాహకులు సెలువోజు చంద్రమౌళి, హేమలత, పోశాల వెంకన్న, గర్వాంధుల మల్లేష్ తదితరులు ఉన్నారు.