వరంగల్ : హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గణపతి పూజలు చేసి, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్ జిల్లాలో వేయిస్తంభాల గుడిలో పూజ అయ్యాకే అన్ని వినాయక మండపాల్లో పూజలు నిర్వహిస్తారన్నారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలను సరిగా నిర్వహించలేదు. ఈ సారి అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రి సూచించారు. వేయి స్తంభాల గుడిని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.