కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకొని బతిమాలినా ఎవరూ పొత్తు కోసం సిద్ధంగా లేరని.. రాహుల్ గాంధీ సమర్థుడైతే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయిందని మంత్రి ఎర్రబల్లె దయాకర్ రావు అన్నారు.
కాంగ్రెస్ సభ పై స్పందిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ లోని తన క్యాంప్ కార్యాలయంలో (ఇల్లు) మీడియాతో మాట్లాడారు.
–కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణ మాఫీ చేశారా..?
-మీరు అధికారం వున్నప్పుడు రైతు బంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు..?
-మీ బోగస్ మాటలు రైతులు నమ్మరు..?
-కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధిహామీ పతాకాన్ని వ్యవసాయనాయికి ఎందుకు అనుసంధానం చేయలేదు.?
-పంటలకు గిట్టుబాటు ధర మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు?
-మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ధాన్యం కొనకపోవడం వల్లే తెలంగాణకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు.
-చెరుకు పరిశ్రమలు మూసేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..?
-పోడు భూముల సమస్య తలెత్తింది కాంగ్రెస్ పాలనలోనే. మీరు అధికారంకో వున్నప్పుడు ఎందుకు చేయలేదు?
-ధరణి ఒక సక్సెస్ స్కీం
-నకిలీ విత్తనాల సృష్టికర్త కాంగ్రెస్ కాదా?
-రైతులను మోసం చేసే బోగస్ సభ ఇది.. సిగ్గులేకుండా రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారు.
-“మీతో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు… ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. మీ పతనం ఖాయం. మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని ఎవరు నమ్మరు. మీరు దేశానికి చేసిందేమీ లేదు.. కేవలం స్వతంత్రం తెచ్చిన కుటుంబమని మీకు పాలించే స్వేచ్ఛ ఇచ్చారు. కానీ తెలంగాణ కు స్వాతంత్ర్యం తెచ్చిన మహానుబావుడు కేసీఆర్” అని మంత్రి ఎర్రబల్లె అన్నారు.