పాలకుర్తి, సెప్టెంబర్ 17 : పద్మశాలీలు అత్యంత విశ్వసనీయులు, పనిమంతులు, నమ్మకానికి ప్రతీకలు, వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టా పంచాయతీరాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పాలకుర్తి పద్మశాలీలు వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లికే తమ ఓటు అని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలకుర్తిలో అసంపూర్తిగా ఉన్న పద్మశాలీల సామాజిక భవనానికి వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే పాలకుర్తిలో నాటి పోరాటయోధుడు కొండా లక్ష్మాణ్ బాపూజీ, నల్లా నర్సింహులు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చేనేతలకు తగిన గుర్తింపు, గౌరవాలు కల్పించిన ఘతన సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. పద్మశాలీ కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
మంత్రిని కలిసిన వారిలో పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం నాయకులు చిలకమారి వెంకటేశ్వర్లు, కాటబత్తిని రమేష్, చిదురాల ఎల్లయ్య, చిదురాల మార్కండేయ, మేడారపు సుధాకర్, పెనుగొండ వెంకటేశ్వర్లు, సోమశేఖర్, చిలుకమారి సోమేశ్వర్, చిలుకమారి నాగేశ్వర్, చిలుకమారి ఉప్పలయ్య, ఎనగందుల శ్రీనివాస్, కామారపు సత్యం, దేవగిరి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.