హైదరాబాద్ : ఈ నెల 4న (రేపు) తన జన్మదినం సందర్భంగాం వేడుకలు వద్దు..మొక్కలు నాటడమే ముద్దు అని పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తాను తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నానని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వేడుకలు చేయవద్దని మంత్రి కోరారు. వేడుకలకు బదులుగా ఎవరికి వారుగా మొక్కలు నాటాలని, నిరుపేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.
మన సీఎం కేసీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మనమంతా కలిసి హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొందామని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా వాతావరణ సమతౌల్యానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి పాటు పడదామన్నారు. మళ్లీ కరోనా పొడ చూపుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.