వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినుల వినాయక నిమజ్జన ఊరేగింపు పర్వతగిరి నుంచి హనుమకొండకు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్కి ఎదురుగా వచ్చింది. దీంతో వెంటనే మంత్రి కాన్వాయ్ని ఆపారు. ఆ విద్యార్థినులతో కలిసి కొంత దూరం ఊరేగింపులో పాల్గొన్నారు.
విద్యార్థినులందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగాలని ఆకాంక్షించారు. వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.