హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాదులోని మంత్రుల నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కవిగా తెలంగాణ సమాజానికి కాళోజీ చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.