వరంగల్ : పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలా రామ్మూర్తి మంగళవారం అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న మంత్రి రామ్మూర్తి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని పాడే మోశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.