మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్రామంలోని స్కూల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పోలెపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కరెంట్, మంచి నీరు, మైనర్ రిపేర్లు, అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.