హనుమకొండ : పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీలో బండి సంజయ్ నిజాయితీపరుడైతే పోలీసులకు సెల్ఫోన్(Cell phone) ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) ప్రశ్నించారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీలు(Paper Leakage) బీజేపీ పనేనని విమర్శించారు. నమో సంస్థల కుట్రలను పోలీసులు బట్టబయలు చేశారని పేర్కొన్నారు.
ఈ కేసులో ఏవన్ గా ఉన్న బండి సంజయ్, ఏ2 గా ఉన్న ప్రశాంత్పథకం ప్రకారమే పేపర్ల లీకేజీలకు పాల్పడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.బండి సంజయ్ ఫోన్ మాటలు బయటపడితే, లీకేజీలలో కేంద్ర బీజేపీ ప్రమేయం బట్టబయలు అవుతుందని వెల్లడించారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ(BJP) అరాచకాలు సృష్టిస్తున్నదని మండిపడ్డారు.విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు బీజేపీ ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేశారు.
పోలీసులు తమదైన పద్ధతిలో లీకేజీ లను ఛేదిస్తున్నారని అన్నారు. చిల్లర రాజకీయాలకు సీఎం కేసీఆర్(CM KCR) భయపడరని మరోమారు స్పష్టం చేశారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలను తట్టుకొని చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు కేసీఆర్అని అన్నారు. మొన్నఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగగా నిన్న పేపర్ల లీకేజీలతో అస్థిర పరిచేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని అన్నారు.
బీజేపీ ఉద్యోగాలు ఇవ్వదు. ఉద్యోగాలు ఇస్తున్న తెలంగాణకు అడ్డుపతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, అరూరి రమేశ్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కాకి రాల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.