హనుమకొండ : గేట్-2022లో ఆలిండియా టాపర్గా నిలిచిన వరంగల్ నిట్ విద్యార్థి సందీప్ రెడ్డి, 9వ ర్యాంకు సాధించిన నిరంజన్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. సందీప్ రెడ్డి వరంగల్ నిట్లో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సందీప్ రెడ్డి స్వస్థలం వరంగల్ నగరం.
ఇక తొమ్మిదో ర్యాంకు సాధించిన నిరంజన్.. మెటలర్జీ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. నిరంజన్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చీకటాయపాలెం. భవిష్యత్లో వీరిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించి, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు.