వరంగల్ : భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి, తెలంగాణ యోధుడు నల్లా నరసింహులు జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సత్యం, అహింసా మార్గంలో ఏదైనా చేయగలం, సాధించగలం అని నిరూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని గాంధీజీ కలలు కనేవారు. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని దయాకర్ రావు పేర్కొన్నారు.