హైదరాబాద్ : సింగరేణి మండలం చీమలవారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ శాసన సభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
సింగరేణి మండలం చీమలవారి గూడెం నుండి పేరేపల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం 4 కి. మీ. బీటీ రోడ్డుతో పాటు 12 సీడీ పనులను రూ. 5 కోట్లతో సంబధిత అధికారులు అంచనా వేశారన్నారు. ఆ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.