హైదరాబాద్ : జనగామ పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పలు వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్ల మండలం రామన్నగూడెంలో బొడ్రాయి ప్రతిష్టాపన, దుర్గమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ బోనాల వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బోనమెత్తుకున్నారు. అనంతరం ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే దేవరుప్పుల మండలం పెద్ద తండ దుర్గమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. అలాగే పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరులో జరిగిన దుర్గమ్మ పండుగలో పాల్గొని, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, పాలక వర్గం ప్రజలు పాల్గొన్నారు.