వరంగల్ : డా.బీఆర్ అంబేద్కర్(Ambedkar) రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో దేశానికి సేవ చేసిన మహనీయుడు అంబేద్కర్. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. జిల్లాలోని పర్వతగిరి మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నా బలం, బలగం బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలే. వారి అండదండలతోనే ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాను. దళితులు ఆర్థికంగా, సామజికంగా ఎదుగాలంటే వారికి ప్రత్యేక నియోజకవర్గాలుండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కర్ అని గుర్తు చేశారు. అంబేద్కర్ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసి చరిత్రలో నిలిచిపోయార్నారు.
ఈ రోజు మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే ఆ పుణ్యం అంబేద్కర్దేనని స్పష్టం చేశారు.ఈ రోజు ఆయన విగ్రహాన్ని పర్వతగిరిలో అవిష్కరించుకుంటున్నం. ఈ సందర్భంగా విగ్రహ దాత ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావుకి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.