హనుమకొండ: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర (Shobhakrut nama samvatsaram) శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది (Ugadi) ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి ఆకాంక్షించారు. శుభప్రదమై ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి రాష్ట్రం పాడి పంటలతో, పసిడి కాంతులతో వెలుగొందాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణ (Telangana) సస్యశ్యామలమై సంక్షేమ, అభివృద్ధిలో అగ్రగామిగా కొనసాగాలన్నారు. శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా హనుమకొండలోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ఉగాది పండుగ జరుపుకున్నారు.