హైదరాబాద్ , ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థలు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి టీ-ఇన్నోవేషన్ దోహదపడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ పల్లెల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 21న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా టీ-ఇన్నోవేషన్ మహోత్సవం నిర్వహిస్తున్నదని చెప్పారు. ఆదివారం మంత్రుల నివాసంలో టీ-ఇన్నోవేషన్ మహోత్సవ పోస్టర్ను టీఎస్ఐసీ సీఐవో డాక్టర్ శాంత తౌటంతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ఆవిషరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో సామాజిక, గ్రామీణ ప్రాంతాలసమస్యల పరిషారానికి టీ-ఇన్నోవేషన్ వినూత్న ఆలోచనతో ముందుకు రావడం సంతోషమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ అట్టడుగున ఉన్న ప్రజల సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిషారాలు, కొత్త ఆవిషరణలకు దారి చూపుతాయని పేర్కొన్నారు. చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్(సీఐవో) డాక్టర్ శాంత తౌటం మాట్లాడుతూ టీఎస్ఐసీ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల్లో కూడా నూతన ఆవిషరణల ఆలోచనను కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు.