Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తనను మూడుసార్లు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నానన్నారు. అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.