హనుమకొండ: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. హనుమకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటుడిగా, పరిపాలకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని, రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇండ్లు ఇచ్చారన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచారని, ఆయన సేవలు చిరస్మరనీయమన్నారు.
అనంతరం ఆయన జనగామ జిల్లా కలెక్టరేట్లో జరిగిన పల్లెప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశానిని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిథులు హాజరయ్యారు.