హైదరాబాద్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో (Philadelphia) తానా (TANA) సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సభలకు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao), నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. అక్కడికి వచ్చిన ఎన్ఆర్ఐలతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎవరు ఎక్కడ ఉన్నా.. ఎన్ఆర్ఐలుసహా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని చెప్పారు. తాను ఈ సభలకు ప్రతి ఏడాదీ హాజరవుతున్నానని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ప్రవాస భారతీయులు అందరికీ మహా సభల శుభాకాంక్షలు తెలిపారు.