హైదరాబాద్ : వరంగల్ – హనుమకొండలో రెండురోజుల పాటు నిర్వహించన్నుట్లు క్రెడాయ్ ప్రాపర్టీ షో-2022 రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్లో ప్రాప్టరీ షో నిర్వహించడం అభినందనీమని, నగరవ్యాప్తంగా రియల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, ఆర్థిక సంస్థలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో అత్యాధునిక ధోరణులను ఒకేచోట ప్రదర్శించేందుకు క్రెడాయ్ చేసిన కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. క్రెడాయ్ వరంగల్ ప్రాపర్టీ షోలో 95 స్టాళ్లను ఏర్పాటు చేయగా.. ప్రతి రోజూ 15వేల మందికిపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ప్రాపర్టీ షో లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, గ్రీన్ బిల్డింగ్స్తో పాటుగా రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్పై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. గృహ రుణ అవకాశాలపై సమాచారంతో పాటు, వాటిని ఎలా పొందవచ్చనే సమాచారాన్ని షోకు వచ్చే సందర్శకులు పొందే అవకాశం ఉంటుంది. షోలో విలువ ఆధారిత గృహాలతో పాటుగా లగ్జరీ గృహాలు సైతం ప్రదర్శించనున్నారు. ప్రాపర్టీ షోలో వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు నగరాల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య స్థలాలు వంటి అత్యుత్తమ రియల్ ఎస్టట్ ప్రాజెక్టులకు ఒకే గొడుగు కింద తెలుసుకునేలా ప్రాపర్టీ షో ద్వారా మంచి అవకాశం లభించిందని మంత్రి తెలిపారు.
వేగవంతమైన వృద్ధితో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన ధరల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందేందుకు, ఉత్తమమైన ఆస్తిని గుర్తించడానికి గృహ కొనుగోలుదారులను సులభతరం చేయడానికి ప్రాపర్టీ షోలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో శాంతిభద్రతలు, ప్రశాంత వాతావరణం ఉండడంతో అనేక సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. వరంగల్ నగరంలో ప్రస్తుతం రూ.2,860 కోట్ల విలువైన 84 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టీఎస్ -బీపాస్ విధానాలతో పారిశ్రామికరంగంలో నిర్మాణ అనుమతులు ఏ రాష్ట్రంలో లేనివిధంగా వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ మహానగరం తర్వాత వరంగల్ నగరంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ హబ్గా మార్పు, సాఫ్ట్వేర్ సంస్థలు, మెగా టెక్స్టైల్ పార్క్, ఎన్ఐటీ లాంటి విశ్వవిద్యాలయాలు ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ క్రెడాయ్ ప్రెసిడెంట్ ప్రేమ్సాగర్రెడ్డి, వరంగల్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి, జనరల్ సెక్రెటరీ మనోహర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవీందర్రెడ్డి, యాత్ వింగ్ కన్వీనర్ వరుణ్ అగర్వాల్ పాల్గొన్నారు.