Minister Dayakar Rao | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. కాటారం సభలో రాహుల్, రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి 420.. తనలాగా బ్రోకర్ మాటలు అంటూ విమర్శించారు. ‘నేను దద్దమ్మ నే!.. అందుకే నన్ను ప్రజలు ఏడుసార్లు గెలిపించారు. నువ్వు ఒకసారి పోటీ చేసినకాడ మళ్లీ పోటీ చేయవు. ఓడిపోతున్నావు. నువ్వో చిల్లరగాడివని దేశమంతా అంటున్నది. నీ మాటలు ఎవరూ నమ్మరు. నీ పార్టీ వాళ్లే నిన్ను తిడుడతున్నరు. నువ్వు రూ.10కోట్లు, రూ.20కోట్లకు టిక్కెట్లు అమ్ముకుంటున్నవని చెబుతున్నరు.
ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలను మారి కాంగ్రెస్కు వచ్చావు. నువ్వు వచ్చినంకనే.. కాంగ్రెస్ నాశనం అయ్యింని మా పార్టీ వాళ్లే అంటున్నరు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చినోడు రాసేస్తే.. రాహుల్ గాంధీ చదువుతున్నాడు’ అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీకి కాళేశ్వరం ప్రాజెక్టు.. సింగరేణి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడైనా కట్టారా? కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కూడా తెలియదని, లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఎవరో రాసిస్తే మాట్లాడడం కాదని.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలని.. తనను విమర్శించిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి దయాకర్రావు స్పష్టం చేశారు.