తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై విజయం సాధించే మంచికి ప్రతీక ఈ దీపావళి అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
‘సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు, రైతు బంధు, రైతు భీమా, రైతు రుణ మాఫీ, మిషన్ భగీరథ వంటి పథకాలతో అన్నదాత కళ్ళలో ఆనందం వెల్లివిరుస్తున్నది. రాష్ట్రం రైతు రాజ్యం కావాలని, బంగారు తెలంగాణ రావాలని కోరుకుంటున్నాను. సీఎం కేసిఆర్ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అని ఎర్రబెల్లి తెలిపారు.