హైదరాబాద్ : మునుగోడు ప్రజలు తమ విచక్షణతో తెలివైన నిర్ణయం తీసుకున్నారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందనలు తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ఎన్నికల్లో చండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించానని, ఇక్కడ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు మంత్రి. ఈ విజయం ప్రజాస్వామ్య విజయమని, మునుగోడు ప్రజల విజయమని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ఉందని మరోసారి రుజువైందన్నారు.
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి అని, ఎప్పటికైనా తెలంగాణలో కారుదే జోరు అన్నారు. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీపై బీఆర్ఎస్ తొలి విజయం సాధించిందని, ఈ విజయంతో దేశంలో బీఆర్ఎస్ జైత్రయాత్ మొదలైందన్నారు. మునుగోడులో పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పారని, ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తున్న బీజేపీకి ఓటుతో మునుగోడు పోటు పొడిచిందని, తెలంగాణలు కుట్రలు చెల్లవంటూ ప్రజలు బీజేపీ చెంప చెల్లుమనిపించారన్నారు. గుజరాత్ గులామ్లకు.. తెలంగాణ సలాం చేయదని ఈ విజయం చాటిచెప్పిందని, ఈ గెలుపు తెలంగాణ ఆత్మగౌరవ విజయం, ఇదీ కేసీఆర్ విజయమని మంత్రి పేర్కొన్నారు.