హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎమ్మెల్యే కూసుకుంట్ల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన విజయం కోసం కృషిచేసిన మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
గత నెల 3న జరిగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి.. చండూరు మున్సిపాలిటీలోని రెండు వార్డులకు ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.