పెద్దవంగర, అక్టోబర్ 19: రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివి మాట్లాడే కంటే.. అభివృద్ధిని చూసి వాస్తవాలు మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పలు ప్రచార సభల్లో మంత్రి మాట్లాడుతూ.. ‘మీ పాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎకడైనా కట్టారా? రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతది? స్క్రిప్టును చదివి మాట్లాడటం కాదు.. ఇకడ జరుగుతున్న అభివృద్ధిని కండ్లారా చూసి మాట్లాడితే నీకు గౌరవం ఉంటది’ అని చెప్పారు. అలాగే.. ‘రేవంత్రెడ్డి ఓ 420.. నన్ను దద్దమ్మ అంటావా? నీ లాగా నాకు బ్రోకర్ మాటలు రావు కాబట్టి నేను దద్దమ్మనే. అందుకే నన్ను ప్రజలు 7 సార్లు గెలిపించారు. నువ్వు ఒకసారి పోటీ చేసిన కాడ మళ్లీ చేయవు. ఓడిపోతున్నావు. నీవు వచ్చినంకనే కాంగ్రెస్ నాశనం అయిందని మీ పార్టీ వాళ్లే అంటున్నారు’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విరుచుకుపడ్డారు.