హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవి చంద్రను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. సోమవారం రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవిచంద్రతో ప్రమాణం చేయించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కేకే, లోకసభలో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర రావు, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, తాతా మధు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవ రెడ్డి, నాగూర్ల వెంకన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు రవి చంద్ర కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ వద్ది రాజు రవి చంద్రకు మంచి అవకాశం కల్పించారు. పార్లమెంటులో రవి చంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల గొంతుక అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.