హైదరాబాద్ : మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణ తరఫున ఢిల్లీలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
సీఎం కేసీఆర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా పని చేయాలన్నారు. ఇదే స్ఫూర్తితో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న ఉన్న తెలంగాణను మరింత సమున్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.