Minister Dayakar Rao | సృజనాత్మకతను పెంపొందించేదే సైన్స్ఫేర్ అని, విద్యార్థుల్లో అంతర్లీనంగా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం గూడూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ఫేర్ను మంత్రి పరిశీలించారు. విద్యార్థుల ఎగ్జిబిట్స్ను పరిశీలించి.. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తరగతి గదుల్లోనే రేపటి భవిత తీర్చిదిద్దబడుతుందని, అందుకు ఉపాధ్యాయులు ఊతంగా ఉండాలన్నారు.
ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటూ.. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. ప్రపంచంలో ఎవరికీ అందని చందమామను మనం చంద్రయాన్ మిషన్ల ద్వారా విధానం, సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పంపిన ఆదిత్య-1 మిషన్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గూడూరు ప్రాంతం నుంచి సైంటిస్టులు ఉన్నారని తెలిపారు. విద్యార్థుల ప్రయోగాలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. సైన్స్ఫేర్ నిర్వహించిన ఉపాధ్యాయులను అభినందించారు. సైన్స్ఫేర్లో ఉత్తమ ఎగ్జిబిట్లను రూపొందించిన విద్యార్థులకు మంత్రి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.