అబద్ధం
ఆయిల్పామ్ సాగు రైతులకు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. సాగుకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుంచి రైతులకు రుణంగా ఇప్పించాలని భావిస్తున్నది.
–ఒక పత్రికలో కథనం
వాస్తవం
ఆయిల్ పామ్ సాగు సబ్సిడీలను ఎత్తివేయలేదు. ఇది నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను రైతులు నమ్మవద్దు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను గమనించి, 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు 30 వేల మంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించాం. 2022-23 సంవత్సరంలో 2 లక్షల ఎకరాల్లో సాగు చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దీనికోసం ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించింది. ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ గమనించే ప్రోత్సహిస్తున్నాం. రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
–వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రకటన