ములుగు: పుట్టినరోజు సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో మొక్కలు నాటారు. వ్యవసాయంపై సిద్దిపేట జిల్లా ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సమావేశానికి హాజరైన మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్.. సబితా ఇంద్రారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు శ్రీనగర్ కాలనిలోని తన నివాసంలో వివిధ ఆలయాల అర్చకులు మంత్రి సబితను ఆశీర్వదించారు. పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు ఆమెతో కేక్ కట్చేయించారు.