నిర్మల్ : జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరతను తీర్చేలా స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండో దశలో కొవిడ్ కేసులు అధికంగా నమోదు అయ్యాయి.
శ్వాసకోస సమస్య, తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరిన వారికి ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందు నిర్మల్ దవాఖానలో కోటి రూపాయాల వ్యవయంతో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు.
గాలిని తీసుకొని సాంకేతిక పరికరాలతో శుద్ధి చేసిన సిలిండర్ల ద్వారా నేరుగా రోగికి అందజేస్తారన్నారు. ఈ ప్లాంట్ ద్వారా నిమిషానికి సుమారు 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. జిల్లా దవాఖానాగా ఆప్ గ్రేడ్ అయిన నిర్మల్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 48.83 కోట్లు మంజూరు చేశారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీయం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కే.విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా మంత్రి కేటీఆర్(minister KTR latest news) పర్యటిస్తున్నారు. అందులో భాగంగా..మంత్రి బీబీపేట్ మండలం జనగామ గ్రామంలో రూ. 6 కోట్లతో నిర్మించిన జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కార్పొరేట్ను తలదన్నేలా బీబీపేట్ జడ్పీ ఉన్నత పాఠశాల భవనం నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.