శనివారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రూ.43.97 లక్షల విలువైన స్కూటర్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, ఇతర సహాయ ఉపకరణాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.24 కోట్లతో 17 వేల మందికి తొలివిడతగా వందశాతం రాయితీపై మూడు చక్రాల స్కూటర్లు, బ్యాటరీ వీల్చైర్లు అందజేస్తున్నట్టు చెప్పారు. అనంతరం పలువురు దివ్యాంగులను మంత్రి పువ్వాడ, కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి సన్మానించారు. – ఖమ్మం వ్యవసాయం