హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు ఎంఐఎం నేతలు మద్దతు పలికారు. శనివారం మధ్యాహ్నం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు యశ్వంత్ సిన్హాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు యశ్వంత్ సిన్హాకు ఎమ్మెల్యేలు తెలిపారు. దేశ వ్యాప్తంగా తమ ఎమ్మెల్యేలందరూయశ్వంత్కే ఓటు వేస్తారని వివరించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్లో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్యప్రదేశ్లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఆయన యశ్వంత్ సిన్హాతో జరిగిన సమావేశంలో పాల్గొనలేదని సమాచారం. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలకు యశ్వంత్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు.