Komatireddy Venkatreddy | హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎంఐఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ ఏంటని ఓ ముస్లిం నాయకుడు కోమటిరెడ్డిని ప్రశ్నించారు. ఆ నాయకుడి మెడలో ఎంఐఎం పార్టీ కండువా ఉండడంతో.. ఎంఐఎం నాయకులతో తాను మాట్లాడనని కోమటిరెడ్డి అన్నారు. మర్యాద ఇవ్వాలని కోమటిరెడ్డి ముస్లిం నాయకులకు సూచించారు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు నాయకుడు.. అసలు మీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ముస్లిం నాయకుడిని పక్కకు లాగి, పోలీసు వాహనంలో ఎక్కించుకుని స్టేషన్కు తరలించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి అనుచరుడు ఒకరు పోలీసులకు సూచించినట్లు వీడియోలో రికార్డు అయింది.
ఏయ్ నోరు మూస్కో.. నేను మీకు మర్యాద ఇవ్వను ఏం చేసుకుంటావో చేస్కో!
ఈ హౌల గాడిని అరెస్ట్ చేయండి.. ముస్లిం నాయకుల మీద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జులుం
సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వ స్టాండ్ ఏంటని అడిగిన ముస్లిం నాయకులు.. దురుసుగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. pic.twitter.com/4gYFmorH7N
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2024