రంగారెడ్డి : ఓ పాల ట్యాంకర్ బోల్తా పడటంతో వందల లీటర్ల పాలు నేల పాలయ్యాయి. ట్యాంకర్లోని పాల కోసం వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు బాటిల్స్, బకెట్స్తో ఎగబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ – కందుకూరు ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
కందుకూరు నుంచి హైదరాబాద్కు బయల్దేరిన పాల ట్యాంకర్.. టిప్పర్ను ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. వాహనదారులు తమ వాహనాలను ఆపి బాటిల్స్లో పాలు పట్టుకునేందుకు యత్నించారు. ఆ చుట్టుపక్కల ఉన్న వారు బకెట్లు, బిందెలు తీసుకుని వచ్చి పాల కోసం ఆరాటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని పాల ట్యాంకర్ను జేసీబీ సహాయంతో.. రోడ్డు పక్కకు నెట్టారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.