హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించటానికి రూ.377.35 కోట్లు, పాత బస్తీ వరకు విస్తరించడానికి రూ. 500 కోట్లు కేటాయించింది. మెట్రో విస్తరణతో ఎయిర్పోర్టు ప్రయాణికులకు లబ్ధి చేకూరనున్నది. ట్రాఫిక్ నుంచి విముక్తి లభించనున్నది.