వికారాబాద్, జూలై 31 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ప్రకటనలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మళ్లీ మభ్యపెట్టి లబ్ధిపొందాలనే ప్రయత్నంలో భాగమే ఈ పాదయాత్ర అని దుయ్యబట్టారు. రాహుల్గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని ఏం చేశారని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓ వైపు రుణమాఫీ, గిట్టుబాటు ధర, రైతు భరోసా తదితర హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారని గుర్తుచేశారు. రాహు ల్ గాంధీని తీసుకొచ్చి, తమకు మాయమాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు గాలికి వదిలేశారని నిరుద్యోగులు సైతం రాస్తారోకోలు చే స్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టి తగిన గుణపాఠాన్ని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.