హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోని ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకెళ్లారు. సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లోని ఎస్1, ఎస్2 బోగీల్లో దొంగతనం చేశారు. అర్ధరాత్రి 1.20 నుంచి 1.50 గంటల మధ్య దోపిడీ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రయాణికులు కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.