హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది. ఒకే రోజు రెండు ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకున్నది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో పరస్పర ఒ ప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల మైనింగ్ విభాగంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్ (ఇద్దరు ప్రొఫెసర్లతో కోర్సు పర్యవేక్షణ కమిటీ) ఏర్పాటు చేసింది.
దీంట్లో భాగంగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ రూ.3 కోట్ల గ్రాంట్ను ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ యాదవ్కు అందించారు. ఈ సందర్భంగా సింగరేణితో కలిసి సంయుక్తంగా ఓ యూ మరో నిర్ణయాన్ని తీసుకున్నది. దేశంలోనే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మొదటిసారిగా మైనింగ్ ఇంజినీరిం గ్ విభాగంలో పని చేసేందుకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద సింగరేణి ఉద్యోగులు సతీశ్, శ్రీనివాస్ను నియమించారు. ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్, మైనింగ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమర్నాథ్ సహా ప్రొఫెసర్లు, పరిశోధకులు పాల్గొన్నారు.