మహబూబ్నగర్, జూన్ 27: జూలై 3న మహబూబ్నగర్ జెడ్పీ మైదానంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం లో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేసిందని, మరో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. బిడ్డలకు జాబ్ రావాలన్న తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు 50 కంపెనీలతో తాము చర్చలు జరిపామని, వచ్చే నెల 3న జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సులు చదివిన అభ్యర్థులు జాబ్మేళాకు రావాలని కోరారు. జాబ్మేళాకు హాజరుకాలేని వారు https:// forms.gle/aWH1uo5poS6RrT3D6 అనే లిం క్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.