ముషీరాబాద్, జూన్ 22 : అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో అశోక్నగర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రూప్-1లోని ఎంపీడీవో పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా కాకుండా డైరెక్టు రిక్రూట్మెం ట్ ద్వారా భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ, ఎ స్సై, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని కో రారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో లైబ్రరీ చుట్టూ తిరిగిన కాం గ్రెస్ నేతలు.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు మర్చిపోయారని విమర్శించారు.