Drone Show | మహబూబ్నగర్లో ట్యాంక్బండ్పై నిర్వహించిన మెగా డ్రోస్ ప్రదర్శన చూపరులను అలరించింది. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభించారు. దాదాపు 450 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యాంతం అత్యద్భుతంగా సాగింది.
ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన ప్రజలతో ట్యాంక్బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. డ్రోన్ షోలో తెలంగాణ, మహబూబ్నగర్, మ్యాప్, కోహినూర్ వజ్రం, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, పిల్లల మర్రి, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం, ఐటీ టవర్, జోగులాంబ దేవాలయం, సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రాలతో పాటు జై భారత్ – జై తెలంగాణ, మన మహబూబ్నగర్ నినాదాలను డ్రోన్ల ద్వారా ప్రదర్శించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ జీ రవి నాయక్, ఎస్పీ కే నరసింహ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ కే వెంకటయ్య, జిల్లా గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు తదితరులు పాల్గొన్నారు.