హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువజన సం ఘాల నేత, ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్రావుతో ఆయన గురువారం భేటీ అయ్యారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. సీఎం కేసీఆర్ 2001లో తెలంగాణ కోసం పార్టీని స్థాపించిన తరువాత ఆయన తొలినాళ్లల్లో కలిసి పనిచేశారు. 2009 వరకు బీఆర్ఎస్లో ఉన్న ఆయన పార్టీని వీడారు. తనకు తోచిన రీతిలో తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జిట్టా కృషి చేశారు.
భువనగిరి కేంద్రంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. తరువాత కొంతకాలానికి బీజేపీలో చేరారు. అక్కడా తెలంగాణ ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వటం లేదని ఆ పార్టీని వీడి కాం గ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కూడా బీజేపీ వైఖరినే అవలంబిస్తుండటంతో కొంతకా లం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉ న్నారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు తీరని అన్యాయం చేస్తున్నాయనిగ్రహిం చారు. కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. తన రాజకీయ ఉద్యమ జీవితం, భవిష్యత్తు ఎక్కడైతే మొదలైందో తిరిగి అక్క డే తెలంగాణకు న్యాయం జరుగుతుందని గ్రహించి తన సొంతగూటికే రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నే మంత్రులు కేటీఆర్, హరీశ్రావును ఆ యన మర్యాదపూర్వకంగా కలిశారు. తన అనుచరులతో జిట్టా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.