హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు దాటినా ఇరురాష్ర్టాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం మరోసారి నిర్లక్ష్య వైఖరి కనబర్చింది. మంగళవారం ఢిల్లీలో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పలు శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో కేంద్రం ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించకుండా నాన్చుడు ధోరణి ప్రదర్శించింది. మొత్తం 11 అంశాలతో ఎజెండాను రాష్ట్రాలకు పంపిన కేంద్రం ఏ ఒక్క అంశంపై స్పష్టత ఇవ్వకుండా రెండు గంటల్లో సమావేశాన్ని ముగించింది. షెడ్యూల్ 9,10 సంస్థల విభజన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్ బలంగా వాదించారు. గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రస్తావించారు.
అంశాల వారీగా..