హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ అయిన కొండా సురేఖకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఫోన్ చేసి మా ట్లాడారు. అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కారణాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాలని కొండా సురేఖకు సూచించినట్టు తెలిసింది. సురేఖ మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు.
పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో, ఇకనుంచి అసెంబ్లీ సమావేశాలకు కొండా హాజరవుతారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.